1940 జూన్ 20–22 న, ఫార్వర్డ్ బ్లాక్ తన మొదటి అఖిల భారత సమావేశాన్ని నాగపూర్లో నిర్వహించింది. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ను సామ్యవాద రాజకీయ పార్టీగా ప్రకటించారు. జూన్ 22 ను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వ్యవస్థాపక తేదీగా తీసుకున్నారు. బ్రిటిషు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం కోసం మిలిటెంట్ చర్యను కోరుతూ ‘అధికారమంతా భారతీయులకే’ అనే తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించింది. పార్టీ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోసు, ప్రధాన కార్యదర్శిగా హెచ్వి కామత్ ఎన్నికయ్యారు
